వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాతో భేటీ తర్వాత చిరంజీవి రాజకీయ వేదాంతం

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: "భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చెప్పలేం. రాజకీయాలు ఎల్లప్పుడూ క్రియాశీలంగా ఉంటాయి తప్పితే నిశ్చలంగా ఉండవు. ఎప్పుడు ఏ మార్పు జరుగుతుందనేది మనం చెప్పలేం" అంటూ ప్రజారాజ్యం అధినేత చిరంజీవి రాష్ట్ర రాజకీయాలపై భవిష్యవాణిని వినిపించారు. శనివారం సాయంత్రం 10 జన్ ‌పథ్ ‌లో కాంగ్రెసు‌ అధినేత్రి సోనియా గాంధీని కలవడం ద్వారా చిరంజీవి రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలకు తెర తీశారు. అగ్రనేతలు అహ్మద్‌ పటేల్‌, వీరప్ప మొయిలీల సమక్షంలో సాగిన ఈ సమావేశంలో కాంగ్రెసు‌, ప్రరాపాలు కలిసి పనిచేసే దిశగా తొలి అడుగు పడింది.

పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూ ఇరుపార్టీలూ ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతానికి రాజ్యసభ బరినుంచి తప్పుకోవాల్సిందిగా సోనియా గాంధీ విజ్ఞప్తి చేయగా, పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామంటూ చిరంజీవి హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి తమ సమావేశం రాజ్యసభ ఎన్నికల వరకే పరిమితమైందని, భవిష్యత్తులో తలెత్తే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ముందుకెళతామంటూ చిరంజీవి ఆ తర్వాత విలేకరులకు చెప్పారు. ఉదయం 12 గంటలకు ఢిల్లీలో అడుగుపెట్టిన చిరంజీవి సాయంత్రం ఆరు గంటలకు సోనియాగాంధీని కలిశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X