వైయస్ జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవడం సరైందే: మంత్రులు

Geetha Reddy
హైదరాబాద్‌: కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ యాత్రను అడ్డుకోవడం సరైందేనని రాష్ట్ర మంత్రులు అభిప్రాయపడ్డారు. ఆ విషయంలో ముఖ్యమంత్రి రోశయ్య తప్పులేదని మంత్రులందరూ చెబుతున్నట్లు మంత్రి గీతారెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వం ఎక్కడా కూడా యాత్రను అడ్డుకోలేదని వివరించారు. కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలు లేవని, మహబూబాద్‌ ఘటనలో ప్రభుత్వ వైఫల్యం లేదని ఆమె అన్నారు. జగన్ ఓదార్పు యాత్రకు ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని ఆమె చెప్పారు.

జగన్‌ యాత్రకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా దురదృష్టకర ఘటన జరిగిందని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్టేషన్‌ బయట పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించినా పరిస్థితి చేజారిందన్నారు. మహబూబాబాద్‌ ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. రోశయ్య రాళ్లు వేయించారని అనడం బాధ్యతారాహిత్యమైన ప్రకటన అని వైద్య ఆరోగ్యశాఖామంత్రి దానం నాగేందర్‌ పేర్కొన్నారు.

యాత్ర వద్దని అందరూ వారించినా జగన్ వినలేదని, ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో అర్థం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+