హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై మెత్తబడిన వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మెత్తబడినట్లు కనిపిస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్సించిన తీరుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతూ వచ్చింది. అదే ఆయన ఓదార్పు యాత్రను అడ్డుకోవడానికి ప్రధాన కారణమైంది. తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు కూడా చాలా మంది తెలంగాణ పట్ల ఆయన వైఖరిని తప్పు పడుతూ వస్తున్నారు. ఓదార్పు యాత్ర పరిణామాల నేపథ్యంలో ఆయన తెలంగాణపై కాస్తా మెత్తబడినట్లు కనిపిస్తున్నారు. ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి.

రాష్ట్రం విడిపోయినా వైయస్ అభిమానులు తెలంగాణలో ఉంటారని ఆయన అన్నారు. తెలంగాణవారిని తాను అభిమానించడం తప్పా అని ఆయన అడిగారు. తెలంగాణలో తనకు అక్కలూ చెల్లెల్లూ ఉండకూడదా అని ఆయన అడిగారు. తెలంగాణలో తన అభిమానులు ఉండకూడదా అని కూడా ఆయన అడిగారు. ఆ మాటల ద్వారా తన తెలంగాణ పట్ల తన కఠిన వైఖరి నుంచి కాస్తా వైదొలిగినట్లు కనిపిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X