చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతి విధ్వంసానికి కుట్ర, ఇ-మెయిల్స్ ద్వారా వెల్లడి!

By Santaram
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయమైన చిత్తూరు జిల్లాపై టెర్రరిస్టులు గురిపెట్టినట్టు వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కర్ణాటక పోలీసులు దర్యాప్తు కోసం వచ్చినప్పుడు కానీ మన పోలీసు యంత్రాంగం మేల్కొనలేదు. అహ్మద్ అనే అనుమానాస్పద వ్యక్తి చిత్తూరు పట్టణంలోని ఒక సైబర్ కేఫ్ లో ఇ-మెయిల్ ఐడి నమోదు చేసుకుని పాకిస్ధాన్ లోని ఇస్లామాబాద్ కు పదే పదే మెయిల్స్ పంపిస్తున్నట్టు కర్ణాటక పోలీసులు గుర్తించారు. కర్ణాటక పోలీసులు రావడంతో జిల్లాలో హై ఎలర్ట్ ప్రకటించారు.

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్ధానాల వద్ద విధ్వంసానికి భారీ వ్యూహరచన చేసి నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ఇస్లామాబాద్ కు ఇ-మెయిల్స్ పంపిన అహ్మద్ అనే అనుమానిత ఉగ్రవాది కదలికలపై కర్ణాటక పోలీసులు నిఘావుంచారు.

ఇ-మెయిల్‌ సందేశంతో చిత్తూరు జిల్లా పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. రాష్ట్ర సరిహద్దులను క్షుణంగా తనిఖీ చేస్తున్నారు. తిరుపతి ఘాట్‌ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాణిపాకం, కాళహస్తి, బోయకొండ ఆలయాల్లో నిఘా వుంచారు. ఎ-మెయిల్ విషయం నిజమేనని ఎస్పీ వివిఎస్ రామకృష్ణ ధృవీకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X