తిరుపతి విధ్వంసానికి కుట్ర, ఇ-మెయిల్స్ ద్వారా వెల్లడి!
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్ధానాల వద్ద విధ్వంసానికి భారీ వ్యూహరచన చేసి నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ఇస్లామాబాద్ కు ఇ-మెయిల్స్ పంపిన అహ్మద్ అనే అనుమానిత ఉగ్రవాది కదలికలపై కర్ణాటక పోలీసులు నిఘావుంచారు.
ఇ-మెయిల్ సందేశంతో చిత్తూరు జిల్లా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర సరిహద్దులను క్షుణంగా తనిఖీ చేస్తున్నారు. తిరుపతి ఘాట్ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాణిపాకం, కాళహస్తి, బోయకొండ ఆలయాల్లో నిఘా వుంచారు. ఎ-మెయిల్ విషయం నిజమేనని ఎస్పీ వివిఎస్ రామకృష్ణ ధృవీకరించారు.
Comments
Story first published: Wednesday, June 9, 2010, 10:49 [IST]