పక్కా ప్లాన్ తో ధిక్కారానికే వైయస్ జగన్ నిర్ణయం?

YS Jagan
హైదరాబాద్: తాజా పరిణామాలను చూస్తుంటే పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడానికే కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో ఆయన ఇందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. కాంగ్రెసులో ఉంటే తాను ముఖ్యమంత్రి కావడానికి దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యం లేదని గ్రహించిన ఆయన సాధ్యమైనంత త్వరగా రాష్టంలో అధికారాన్ని చేపట్టేందుకు అవసరమైన ఎత్తుగడను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఎన్సీపిలో చేరడం ద్వారా ఆయన తన సొంత బలం, బలగంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.

తన ఉద్దేశాన్ని ఆయన బుధవారం సూచనప్రాయంగా వెల్లడించినట్లు చెబుతున్నారు. ఆయన బుధవారం రాజమండ్రిలో గాయపడిన చికిత్స పొందుతున్న పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ ను పరామర్శించారు. హర్షకుమార్ మొదటి నుంచీ జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. ఆ తర్వాత శాసనసభ్యుడు మల్లాది విష్టు తండ్రి సుబ్బారావు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆయన రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణలోని నల్లగొండ మీదుగా హైదరాబాద్ చేరుకోవడంలో ఆయన వ్యూహం దాగి ఉందని అంటున్నారు.

రోడ్డు మార్గంలో వస్తున్నప్పుడు ఆయనకు స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించినట్లుగానే భావిస్తున్నారు. ఏదైనా జులై 8వ తేదీ తర్వాతనే నిర్ణయమని ఆయన అభిమానులకు చెప్పారు. దీన్ని బట్టి ఆయన 8వ తేదీన అధిష్టానం ఆదేశాలను ధిక్కరించైనా సరే ముందుకు సాగాలని అనుకుంటున్నట్లు వార్తాకథనాలు వెలువడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+