హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీలోనే ఉంటారు: కేశవరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Keshav Rao
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలోనే ఉంటారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవ రావు స్పష్టం చేశారు. జగన్ శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపిలో చేరుతారని వచ్చిన వార్తలో నిజం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ ను మీడియా బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన విమర్శించారు.

పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే తెలంగాణలోని 12 శాసనసభా నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ నినాదంతోనే ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో తెలంగాణ రాదని ఆయన అన్నారు. తెరాసతో కాంగ్రెసు కుమ్మక్కయిందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X