చిరుకు హరికృష్ణ లేఖపై రామచంద్రయ్య ఎలా చెప్తారు: టిడిపి
సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ నేతలపై గతంలో చిరంజీవి చేసిన అవినీతి ఆరోపణలను ప్రస్తుతం సరిదిద్దుకుంటున్నారని అందుకు అనుగుణంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తన నీతి నిజాయతీ గురించి ప్రజలందరికీ తెలుసునని, ప్రత్యేకించి మంత్రి దానం నాగేందర్ తనకు ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. తనపై అక్కసుతోనే అభాండాలు వేస్తూ లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తనకు తన కుటుంబ సభ్యులకు రాజధానిలో వందల కోట్ల ఆస్తులున్నట్లు వస్తున్న ఆరోపణలపై గాలి స్పందిస్తూ...ఆస్తులు ఎక్కడ ఉన్నాయో చూపెడితే వారికే రాసిస్తానని వ్యాఖ్యానించారు. అవినీతిని బయటపెట్టడమే తన లక్ష్యమన్నారు.
Comments
రామచంద్రయ్య ప్రజారాజ్యం హరికృష్ణ తెలుగుదేశం గాలి ముద్దుకృష్ణమనాయుడు హైదరాబాద్ prajarajyam harikrishna telugudesam gali muddukrishnama naidu hyderabad
Story first published: Saturday, June 12, 2010, 16:43 [IST]