విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆనాడు పోలీసులే నన్ను తప్పించారు: సత్యంబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijaywada
విజయవాడ: పోలీసులే తనను తప్పించి పారిపోయాడని చెప్పారని విజయవాడ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో నిందితుడు సత్యంబాబు చెప్పాడు. విజయవాడ మెజిస్ట్రేట్ ముందు అతను సోమవారం తన పరారీకి సంబంధించిన పోలీసు కథనంపై నిజాలను వెల్లడించాడు. తన పరారీ డ్రామా ఎలా జరిగిందో పూసగుచ్చినట్లు అతను తెలిపాడు. హైదరాబాదు నుంచి విజయవాడకు తీసుకుని వెళ్తుండగా పోలీసుల కళ్లు గప్పి సత్యంబాబు పారిపోయినట్లు ప్రకటించి, ఆ తర్వాత అతన్ని పట్టుకున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రాణ హాని తలపెట్టేందుకే సత్యంబాబును ఆ రోజు పోలీసులు తప్పించారని సత్యంబాబు తరఫు న్యాయవాది చెప్పారు. అయితే సత్యంబాబు వాదనపై తాము చెప్పేదేమీ లేదని పోలీసులు అంటున్నారు. కేసు కోర్టులో ఉందని, సత్యంబాబు పారిపోయాడా, పోలీసులు తప్పించారా అనేది కోర్టు నిర్ణయించాల్సిందేనని వారంటున్నారు. కాగా, సత్యంబాబు కేసు ఎల్లుండికి వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X