వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో డిఎస్ బిజీ: తెలంగాణ ఉప ఎన్నికలపై చర్చోపచర్చలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మంగళవారం ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో 12 శాసనసభా స్థానాలకు జరిగే ఉప ఎన్నికలపై ఆయన వారితో చర్చోపచర్చలు చేస్తున్నారు. ఆయన మంగళవారం ఉదయం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో ఆయన సమావేశమయ్యారు.

అహ్మద్ పటేల్ ఇతర నాయకులతో కూడా ఆయన చర్చిస్తారు. ఇప్పుడే ఏమీ చెప్పలేనని, సాయంత్రం ఏమైనా చెప్పగలనని ఆయన సోనియాతో భేటీ అనంతరం అన్నారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలపై చర్చించేందుకు సాయంత్రం పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఉప ఎన్నికల్లో పోటీ నిర్ణయం తీసుకుంటారు. ఏ నినాదంతో పోటీకి దిగాలనేది కూడా నిర్ణయిస్తారు. మొత్తం మీద, ఉప ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X