హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు రెండు కళ్లంట కదా: జస్టిస్ శ్రీకృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikrishna
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి సీమాంధ్ర, తెలంగాణ రెండు కళ్లంట కదా అని రాష్ట్ర పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ శ్రీకష్ణ వ్యాఖ్యానించారు. చంద్రబాబును తాము ఇది వరకే కలిశామని, మళ్లి కలవబోమని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణలోని ఉప ఎన్నికలను వాయిదా వేయాలని తాము కోరలేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరి విధులు వారు నిర్వహిస్తారని, ఉప ఎన్నికల విషయాన్ని ఎన్నికల కమిషన్ చూసుకుంటుందని ఆయన చెప్పారు. వచ్చే నెలలో తాను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని ఆయన తెలిపారు. జులై 5,6,7 తేదీల్లో కాంగ్రెసు నేతలతో సంప్రదింపులు జరుపుతామని ఆయన అన్నారు. తాము ఇప్పటి వరకు వంద సంఘాలు, వేయి మంది వ్యక్తుల వాదనలు విన్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ సభ్యులను తెలంగాణ మెడికల్‌ ఫోరం నేతలు కలిసి తమ వాదనలు వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. తెలంగాణ ఇవ్వాల్సిందేనని, అది ఎమర్జెన్సీ కేసు అని వారన్నారు. మరోవైపు శ్రీకృష్ణ కమిటీకి గురువారం పలు ప్రభుత్వ శాఖలు నివేదికలు అందించనున్నాయి. గిర్‌గ్లానీ కమిషన్‌ నివేదికను అధికారులు కమిటీకి అందించనున్నారు. 610 జీవో అమలుపై సాధారణ పరిపాలన శాఖ నివేదికను ఇవ్వనుంది. ప్రణాళిక, ఆర్థిక, విద్య తదితర విభాగాల అధికారులు శాఖ పరమైన అంశాలపై కమిటీ సభ్యులతో భేటీ కానున్నారు. కాగ్‌ అధికారులు కూడా కమిటీకి నివేదిక ఇవ్వనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X