హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ యాత్రకు చెక్: జులై 8న వైయస్ జయంతి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు చెక్ పెట్టడానికి ముఖ్యమంత్రి రోశయ్య నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆయన మంత్రివర్గం శుక్రవారం రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. ఒకటి - జులై 7వ తేదీ నుంచి పది రోజుల పాటు శాసనసభా సమావేశాలు నిర్వహించడం, రెండోది - జులై 8వ తేదీన వైయస్సార్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం. అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి కూడా జగన్ జులై 8వ తేదీ నుంచి ఓదార్పు యాత్రను చేపట్టాలని నిర్ణయించుకుంటే అందులో శాసనసభ్యులు పాల్గొనకుండా జులై 7వ తేదీనుంచే శాసనసభా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

వైయస్సార్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరఫున జులై 8వ తేదీన ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి జగన్ ను కూడా ఆహ్వానించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావాలా, శ్రీకాకుళం జిల్లా నుంచి ఓదార్పు యాత్ర చేపట్టాలా అనే విషయాన్ని జగన్ తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా జగన్ ను ఇరకాటంలో పెట్టేందుకు రోశయ్య నిర్ణయించుకున్నారు. అయితే, జగన్ ఓదార్పు యాత్ర చేపడితే శాసనసభ్యులు పాల్గొనాలని ఏమీ లేదని పిసిసి ప్రధాన కార్యదర్శి, జగన్ మద్దతుదారు అంబటి రాంబాబు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X