హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉగ్రవాద లష్కరే తోయిబా టార్గెట్ లో హైదరాబాద్

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
వాషింగ్టన్‌: లష్కరే తోయిబా టార్గెట్ లో హైదరాబాద్ ప్రముఖంగా ఉంది. భారత్‌ లోని ప్రధాన నగరాల్లో దాదాపు 100కి పైగా గుర్తించిన లక్ష్యాల్లో విధ్వంసాలు సృష్టించేందుకు లష్కర్‌-ఎ-తొయిబా వ్యూహరచన చేసినట్టు అమెరికా పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాది హెడ్లీ వెల్లడించాడని సమాచారమందింది.

ఇటీవలే అతన్ని భారత పరిశోధక బృందానికి చెందిన నలుగురు సభ్యుల బృందం విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబయిలోని తాజ్‌ హోటల్‌తో పాటు మరిన్ని లక్ష్యాలను తాను వీడియో తీసినట్టు అతను అంగీకరించినట్టు సమాచారం. భారత్‌ లో మరిన్ని విధ్వంసాలు చేసేందుకు లష్కర్‌ ఉగ్రవాదులు కుట్రపన్నారని అయితే ఉగ్రవాదుల జాతీయతపై అతని దగ్గరనుంచి ఎలాంటి సమాచారం లభ్యంకాలేదని తెలియవచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X