వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో చంద్రబాబు వ్యూహం ఫలించేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu
హైదరాబాద్: తెలంగాణ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహం ఫలిస్తుందా అనేది సందేహంగానే ఉంది. ఉప ఎన్నికల్లో ఎదురుదాడే వ్యూహంగా ప్రచారం చేయాలని తెదేపా నిర్ణయించింది. ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖనుగానీ, తెలంగాణకు అనుకూలంగా సంస్థాగతంగా చేసిన తీర్మానాన్నీగానీ వెనక్కుతీసుకోలేదనే అంశాన్ని ప్రచారం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్‌పార్టీ కనీసం ప్రణబ్‌ కమిటీకి లేఖ కూడా ఇవ్వలేదనే అంశాన్ని ప్రధానంగా లేవనెత్తే అవకాశం ఉంది. మరోవైపు తెరాస అధినేత కేసీఆర్‌కు రాజకీయ ప్రయోజనాలు తప్ప ఏనాడైనా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడారా అనే విషయాన్ని ప్రశ్నించనుంది. తెలుగుదేశం సాగించే ఈ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్ముతారా అనేది చెప్పలేం. ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించగానే చంద్రబాబు మాట మార్చారు.

తెలంగాణ సీనియర్ నేతల సమావేశంలో ప్రచార వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. తెదేపా అధినేత చంద్రబాబు, సీనియర్‌ నేతలు నాగం జనార్దనరెడ్డి, దేవేందర్‌గౌడ్‌, మోత్కుపల్లి నర్సింహులు, మండవ వెంకటేశ్వరరావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, గోనె హనుమంతరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. పది జిల్లాల అధ్యక్షులతోపాటు అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. తెలంగాణకు సంబంధించి బాబ్లీ ప్రాజెక్టు అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా ఎన్నుకోనుంది.

కరీంనగర్‌ జిల్లాకు సంబంధించి హుజూరాబాద్‌, ధర్మారం, కోరుట్ల సెగ్మంట్లల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, శుక్రవారం సమావేశంలో వీటి చర్చ రాలేదు. మెదక్‌ జిల్లా సిద్దిపేట నుంచి ఆరుగురు ఆశావహులు ఉండగా డీసీసీ నుంచి ఏకాభిప్రాయంతో ఒక్కరిపేరే సూచిస్తామని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నందీశ్వర్‌గౌడ్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలో రెండుచోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తానే పోటీ చేస్తున్నానని డీఎస్‌ తెలిపారు. ఎల్లారెడ్డి నుంచి పాత అభ్యర్థి జనార్దన్‌ గౌడ్‌ వైపే నియోజకవర్గ నేతలు మొగ్గు చూపుతున్నారు. వరంగల్‌ పశ్చిమం నుంచి అభ్యర్థుల అంశం ప్రస్తావనకు రాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X