తెలంగాణలో చంద్రబాబు వ్యూహం ఫలించేనా?
తెలంగాణ సీనియర్ నేతల సమావేశంలో ప్రచార వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. తెదేపా అధినేత చంద్రబాబు, సీనియర్ నేతలు నాగం జనార్దనరెడ్డి, దేవేందర్గౌడ్, మోత్కుపల్లి నర్సింహులు, మండవ వెంకటేశ్వరరావు, రావుల చంద్రశేఖర్రెడ్డి, రేవూరి ప్రకాష్రెడ్డి, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, గోనె హనుమంతరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. పది జిల్లాల అధ్యక్షులతోపాటు అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. తెలంగాణకు సంబంధించి బాబ్లీ ప్రాజెక్టు అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా ఎన్నుకోనుంది.
కరీంనగర్ జిల్లాకు సంబంధించి హుజూరాబాద్, ధర్మారం, కోరుట్ల సెగ్మంట్లల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, శుక్రవారం సమావేశంలో వీటి చర్చ రాలేదు. మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి ఆరుగురు ఆశావహులు ఉండగా డీసీసీ నుంచి ఏకాభిప్రాయంతో ఒక్కరిపేరే సూచిస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందీశ్వర్గౌడ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో రెండుచోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ నుంచి తానే పోటీ చేస్తున్నానని డీఎస్ తెలిపారు. ఎల్లారెడ్డి నుంచి పాత అభ్యర్థి జనార్దన్ గౌడ్ వైపే నియోజకవర్గ నేతలు మొగ్గు చూపుతున్నారు. వరంగల్ పశ్చిమం నుంచి అభ్యర్థుల అంశం ప్రస్తావనకు రాలేదు.