తెలంగాణ ఉప ఎన్నికలు: బాబ్లీపై టిడిపి పోరు
తమ పోరాటంలో భాగంగా తెలుగుదేశం నాయకులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. బాబ్లీ ప్రాజెక్టును ఆపించడానికి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు కడియం శ్రీహరి తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కోరారు. అలాగే, మంగళవారం తెలుగుదేశం ప్రతినిధి బృందం ఒకటి ఢిల్లీ వెళ్తోంది. కేంద్ర జల వనరుల సంఘం (సిడబ్ల్యుసి) అధికారులను, కేంద్ర జల వనరుల మంత్రి బన్సాల్ ను వారు కలుస్తారు. బాబ్లీ, ఇతర అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని వారు కోరనున్నారు.
Comments
తెలుగుదేశం తెలంగాణ ఉప ఎన్నికలు బాబ్లీ ప్రాజెక్టు హైదరాబాద్ telugudesam babli project telangana by polls hyderabad
Story first published: Monday, June 28, 2010, 11:42 [IST]