హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

75 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా పారిశ్రామిక విధానం: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: నూతన పారిశ్రామిక విధానం ద్వారా 15 శాతం వృద్ధిరేటు సాధించేందుకు యత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. 2010-15 పారిశ్రామిక విధానాన్ని ఆయన గురువారం సచివాయలయంలో విడుదల చేశారు. రానున్న అయిదేళ్లలో 75 వేలకోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యంగా నూతన విధానం రూపొందించామని ఆయన చెప్పారు. ఏడాదికి 15 వేల కోట్ల పెట్టుబడులతో ఆ లక్ష్యాన్ని సాధించాలనేది తమ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు.

పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ పరిశ్రమలశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, చిన్న పరిశ్రమల శాఖ మంత్రి డి.కె.అరుణ. ఐటీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్‌ ఆండ్‌ బీ మంత్రి గల్లా అరుణకుమారి, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X