హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆట రియాల్టీ షోపై పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Omkar
హైదరాబాద్‌: ఆట-5 రియాల్టీ షోను నిలిపివేయాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిల్ ను) రాష్ట్ర హైకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఈ షోను నిలిపివేయాలంటూ మానవహక్కుల కమిషన్‌ ఆదేశాలు ఇవ్వగా సదరు ఛానల్‌ కోర్టుకు వెళ్లి స్టే పొంది, తిరిగి కొనసాగిస్తోంది. దీంతో ఆ షోను నిలిపివేయాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.

పిల్ ను విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సదరు షోను ప్రసారం చేస్తున్న టీవీ ఛానల్‌కు నోటీసులు జారీ చేశారు. ఆటలో చిన్నారులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారంటూ ప్రజా సంఘాలు గతంలో మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. దీనిపై మానవ హక్కుల కమిషన్ ఆటను నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై చానెల్ స్టే పొందింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X