శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధిక్కారానికి రెడీ: దేనికైనా వైయస్ జగన్ సిద్ధం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌ : పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడానికే కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ సిద్ధపడ్డారు. తన ఆంతరంగికులు, సన్నిహితులతో ఆయన మంతనాలు జరిపి శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి ఓదార్పు యాత్రను చేపట్టడానికి ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ఓదార్పు యాత్రకు శ్రీకాకుళం జిల్లాలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగన్ ఓదార్పు యాత్రకు ఏ విధమైన అనుమతి పత్రం అవసరం లేదని జగన్ కు సన్నిహితుడైన పిసిసి ప్రధాన కార్యదర్సి అంబటి రాంబాబు అన్నారు. ఓదార్పు యాత్ర జరుగుతుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి ఏలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి జగన్ సిద్ధపడ్డారని అనుకోవచ్చు.

ఓదార్పు యాత్రకు మాటిమాటికీ అనుమతి అవసరం లేదని కాంగ్రెసు నాయకుడు గట్టు రామచంద్ర రావు అన్నారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో ఓదార్పు యాత్ర పూర్తయిందని, చిన్న ఆటంకం రాకపోతే ఇప్పటికే మరో రెండు జిల్లాల పర్యటన ముగిసి ఉండేదని ఆయన అన్నారు. మొదటిసారి ఓదార్పు యాత్రకు వెళ్లే సమయంలో జగన్ ముఖ్యమంత్రి రోశయ్యను కలిశారని, అందువల్ల మాటిమాటికీ అనుమతి అవసరం లేదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రతో పార్టీకి సంబంధం లేదని, ఇది పూర్తిగా జగన్ వ్యక్తిగతమని, దీన్ని తమ గురువు, ముఖ్యమంత్రి కె. రోశయ్య అర్థం చేసుకోవాలని కాంగ్రెసు శాసనసభ్యుడు శైలజానాథ్ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X