e-Visa: ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!

భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ పర్యాటకులకు, విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దేశంలోకి ఈ-వీసా ఆధారంగా అడుగుపెట్టే విదేశీయుల కోసం కొత్తగా మరో 11 అంతర్జాతీయ ప్రవేశ మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి విమానాశ్రయంతో పాటు భోపాల్ ఎయిర్‌పోర్టు, మరో తొమ్మిది కీలకమైన ల్యాండ్ పోర్టులు ఉన్నాయి. ఈ తాజా నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఈ-వీసా ద్వారా ప్రవేశించగలిగే మొత్తం కేంద్రాల సంఖ్య ఏకంగా 88కి చేరింది.

కొత్తగా చేరిన ప్రవేశ మార్గాలు ఇవే!

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ కొత్త సదుపాయంలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు, తొమ్మిది ల్యాండ్ పోర్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ విమానాశ్రయాల నుంచి విదేశీయులు ఇకపై నేరుగా ఈ-వీసాతో ప్రవేశించవచ్చు.

India Expands e-Visa Access with 11 New Entry Ports Including Tirupati and Bhopal International Airports

వీటితో పాటు భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని అట్టారీ, అలాగే అగర్తలా, దర్రంగా, గేడె, ఘోజాడంగా, హరిదాస్‌పూర్, జైగావ్, డావుకీ, మోరే ప్రాంతాల్లోని ల్యాండ్ చెక్‌పోస్టులను ఈ జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ఉన్న 88 కేంద్రాలలో 37 విమానాశ్రయాలు, 38 సముద్ర పోర్టులు, 13 భూ సరిహద్దు చెక్‌పోస్టులు ఉన్నాయి.

దశాబ్ద కాలంలోనే బిగ్ జంప్! దేశంలో సింహల గర్జన అదుర్స్
దశాబ్ద కాలంలోనే బిగ్ జంప్! దేశంలో సింహల గర్జన అదుర్స్

72 గంటల్లోనే 95 శాతం ఈ-వీసాలు క్లియర్!

దేశంలో టూరిజం అభివృద్ధికి, విదేశీ ప్రయాణాలను సులభతరం చేసేందుకు కేంద్రం అనేక ఆధునిక సాంకేతిక మార్పులు చేస్తోంది. అత్యంత వేగవంతమైన భద్రతా తనిఖీలతో కూడిన ఈ వ్యవస్థ ద్వారా పర్యాటకులు సులభంగా అనుమతులు పొందుతున్నారు. ప్రస్తుతం భారత్ జారీ చేస్తున్న మొత్తం వీసాల్లో దాదాపు 78 శాతం వరకు ఎలక్ట్రానిక్ వీసాలే కావడం విశేషం. అంతేకాకుండా అందిన దరఖాస్తుల్లో సుమారు 95 శాతం ఈ-వీసాలను కేవలం 72 గంటల్లోనే అధికారులు క్లియర్ చేస్తున్నారు.

నిర్మలమ్మ హామీ! మూజువాణి ఓటుతో కీలక బిల్లుకు ఆమోదం
నిర్మలమ్మ హామీ! మూజువాణి ఓటుతో కీలక బిల్లుకు ఆమోదం

43 నుంచి 172 దేశాలకు విస్తరించిన సేవలు

భారత ప్రభుత్వం తొలిసారిగా 2014లో 'ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్' పేరుతో కేవలం 43 దేశాలకు మాత్రమే ఈ-వీసా వెసులుబాటును ప్రారంభించింది. కానీ ఏటికేడు ప్రజాదరణ పెరగడంతో ప్రస్తుతం ఈ సదుపాయం ఏకంగా 172 దేశాల పౌరులకు విస్తరించింది. పర్యాటకం, వ్యాపారం, వైద్యం, ఉన్నత విద్య, పర్వతారోహణ, క్రూయిజ్ ప్రయాణాలు వంటి దాదాపు 17 రకాల విభిన్న అవసరాల కోసం వచ్చే విదేశీయులకు ఈ-వీసాలను జారీ చేస్తున్నారు. తాజా విస్తరణతో దేశంలోకి విదేశీ పెట్టుబడులు, పర్యాటక రంగం మరింత వేగంగా పుంజుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+