హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీనియర్లకు బెదిరింపు ఫోన్‌కాల్స్: జగన్ వర్గం పనేనా?

|
Google Oneindia TeluguNews

k kesava rao
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైయస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రం రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళంలో సాగుతున్న ఓదార్పు యాత్ర తొలిరోజు చప్పగా సాగింది. రెండో రోజున రాష్ట్రంలో రాజకీయాలు అట్టడుగు స్థాయికి దిగజారి పోయాయంటూ తొలి విమర్శనా బాణం వదిలారు. మూడో రోజు యాత్రలో తన అస్త్రాలకు మరింత పదును పెట్టారు.

ఓదార్పు యాత్రలో పాల్గొనాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉవ్విళ్లూరుతున్నారు. వారి మనసంతా వైయస్తోనే ఉంది. కానీ యాత్రలో పాల్గొనకుండా వారిని అడ్డుకున్నారు. ఫలితంగా వారు నరకయాతన అనుభవిస్తూ.. వారు రాలేక వారి భార్యలు, సోదరులు, బంధువులను పంపిస్తున్నారంటూ విమర్శించారు.

దీనిపై వైయస్ వ్యతిరేక వర్గానికి చెందిన సీనియర్ నేతలు భగ్గుమన్నారు. ఆ మరుక్షణమే వైఎస్ వర్గం వారిపై ఎదురుదాడికి దిగింది. ఈ వేడి చల్లారక ముందే.. మీడియాలో సరికొత్త కథనాలు వచ్చాయి. సీనియర్ నేతలైన కేకే (కె.కేశవరావు), వీహెచ్ (వి.హనుమంతరావు)లకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X