వైయస్ జగన్ పై ఒత్తిడి పెంచుతున్న కాంగ్రెసు హైకమాండ్

తొలిసారి గెలిచిన శాసనసభ్యుల వివరాలను సేకరిస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎవరో తెలియదంటూ, వైయస్ వల్లనే తాము గెలిచామని చెబుతున్నవారిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రెండో సారి గెలిచినవారి గురించి కూడా ఆరా తీస్తోంది. వారి ఆస్తుల వివరాలను, వారి రాజకీయేతర కార్యకలాపాలాను సేకరిస్తోంది. వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తోంది. రాష్ట్రంలోని విలువైన భూములను దక్కించుకున్నవారి గురించి వివరాలు సేకరిస్తోంది. జగన్ కు మద్దతు తెలుపుతున్న నాయకుల వివరాలు కూడా సేకరిస్తోంది. అవసరమైతే తీవ్రమైన చర్యలు తీసుకుని జగన్ ను ఒంటరి చేసే దిశగా పావులు కదుపుతోంది. జగన్ వ్యవహారంపై మంగళవారం వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ విస్తృతంగా మంతనాలు జరిపారు.












Click it and Unblock the Notifications