వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ పై ఒత్తిడి పెంచుతున్న కాంగ్రెసు హైకమాండ్
తొలిసారి గెలిచిన శాసనసభ్యుల వివరాలను సేకరిస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎవరో తెలియదంటూ, వైయస్ వల్లనే తాము గెలిచామని చెబుతున్నవారిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రెండో సారి గెలిచినవారి గురించి కూడా ఆరా తీస్తోంది. వారి ఆస్తుల వివరాలను, వారి రాజకీయేతర కార్యకలాపాలాను సేకరిస్తోంది. వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తోంది. రాష్ట్రంలోని విలువైన భూములను దక్కించుకున్నవారి గురించి వివరాలు సేకరిస్తోంది. జగన్ కు మద్దతు తెలుపుతున్న నాయకుల వివరాలు కూడా సేకరిస్తోంది. అవసరమైతే తీవ్రమైన చర్యలు తీసుకుని జగన్ ను ఒంటరి చేసే దిశగా పావులు కదుపుతోంది. జగన్ వ్యవహారంపై మంగళవారం వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ విస్తృతంగా మంతనాలు జరిపారు.
Comments
వైయస్ జగన్ కాంగ్రెసు ఓదార్పు యాత్ర ఉండవల్లి అరుణ్ కుమార్ న్యూఢిల్లీ ys jagan congress odarpu yatra new delhi undavalli arun kumar
Story first published: Wednesday, July 14, 2010, 8:51 [IST]