హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డి శ్రీనివాస్ కు కష్టాలు: ఇసి నోటీసుకు వివరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్: తెలంగాణ 12 శాసనసభ సభా స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తానే ముప్పు తిప్పలు పడుతూ మూడు చెరువుల నీళ్లు తాగుతున్నారు. విజయం కోసం ఆయన ఎత్తుకున్న తెలంగాణ నినాదం వివాదాలకు దారి తీస్తోంది. ఎన్నికల సంఘం నుంచి ఆయన నోటీసుల మీద నోటీసులు అందుకుంటున్నారు. తాను అందుకున్న నోటీసుకు డి. శ్రీనివాస్ గురువారం ఇసికి వివరణ ఇచ్చుకున్నారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా ఉందని, మేడం సోనియా గాంధీతోనే తెలంగాణ వస్తుందని చేసిన వ్యాఖ్యలకు ఇసి ఆయనకు నోటీసు ఇచ్చింది.

తాను అందుకున్న నోటీసుకు ఆయన గురువారం వివరణ ఇచ్చారు. తెలంగాణపై తాను పార్టీ వైఖరిని మాత్రమే చెప్పానని, తాను ఉల్లంఘనలకు పాల్పడలేదని ఆయన చెప్పుకున్నారు. ఇది వరకు ఓసారి ఆయన తెలంగాణ అంశంపై ఇసి నుంచి ఆయన నోటీసు అందుకున్నారు. ఆ నోటీసుపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. అప్పుడు డిఎస్ ను ఇసి మందలించి వదిలేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X