తెలంగాణ ఉప ఎన్నికల కోసమే చంద్రబాబు బాబ్లీ యాత్ర?

బాబ్లీ ప్రాజెక్టును ఆపించకపోతే తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు అందక ఈ ప్రాంతంలోని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పదలుచుకున్నారు. అలా జరగకుండా తాము బాబ్లీని ఆపించేందుకు పోరాటం చేస్తున్నామని, కాంగ్రెసు ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుందని ఆయన చాట దలుచుకున్నారు. తద్వారా తెలంగాణ ఓటర్ల మనస్సులను ఆకట్టుకోవాలనేది ఆయన ప్రయత్నంగా కనిపిస్తోంది. బాబ్లీ ప్రాజెక్టు చెంతకు మహారాష్ట్ర ప్రభుత్వం రానీయదనే విషయం చంద్రబాబుకు తెలుసు. అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడం ద్వారా ప్రజల సానుభూతి పొందాలనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications