వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముఖ్యమైన పనిపై ఢిల్లీ వస్తున్న ముఖ్యమంత్రి రోశయ్య
ఉప ఎన్నికల దృష్ట్యా పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాత్రం సమావేశానికి రాలేకపోతున్నారు. పార్టీ వ్యవస్థాగత ఎన్నికలను సమీక్షించేందుకు గత కొద్ది రోజులుగా సోనియా-పీసీసీ అధ్యక్షులతోనూ, సీఎల్పీ నేతలతోనూ, ముఖ్యమంత్రులతోనూ, పార్టీ ఇన్ఛార్జులుగా ఉన్న ప్రధాన కార్యదర్శులతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న దశలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్చవాన్ శనివారం సోనియాతో సమావేశం కావడం, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబును మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో సీఎం-బాబ్లీ అంశాన్ని సోనియాతో ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.
Comments
రోశయ్య వీరప్ప మొయిలీ సోనియా గాంధీ కాంగ్రెసు న్యూఢిల్లీ rosaiah veerappa moily sonia gandhi congress new delhi
Story first published: Sunday, July 18, 2010, 14:59 [IST]