కెవిపి రామచంద్ర రావు దిగాడు రంగంలోకి..

KVP Ramachandar Rao
హైదరాబాద్: తన ప్రియ మిత్రుడి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కోసం రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెసు అధిష్టానంతో సాన్నిహిత్యాన్ని నెరపుతూ జగన్ కు నష్టం జరగకుండా బాధ్యతను కెవిపి రామచందర్ రావు భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో తనకు సాన్నిహిత్యాన్ని కెవిపి తెలివిగా వాడుకుంటున్నట్లు అర్థమవుతోంది. మొదటి నుంచీ మొయిలీ వైయస్ జగన్ కు అనుకూలంగా ఉన్నారు. దీన్ని కెవిపి జగన్ కోసం వాడుతున్నట్లు చెబుతున్నారు.

జగన్ కు అనుకూలంగా శుక్రవారం ప్రకటన చేయడం కెవిపి సరికొత్త రాజకీయం వల్లనే జరిగిందని అంటున్నారు. మొయిలీ ఆంగ్ల పుస్తకం తెలుగు అనువాదం కాలం అంచున ఆవిష్కరణ కోసం శుక్రవారం హైదరాబాద్ వచ్చారు. ఆ ఆవిష్కరణ బాధ్యతనంతా కెవిపి రామచంద్ర రావు తన మీద వేసుకున్నట్లు సమాచారం. కెవిపి రామచంద్రక రావే తెలుగు అనువాద గ్రంథం అచ్చు నుంచి ఆవిష్కర వరకు చూసుకున్నట్లు చెబుతున్నారు. తద్వారా తెగుతున్న బంధాన్ని వీరప్ప మొయిలీతో మరోసారి పెనవేసుకున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+