హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహారాష్ట్ర తీరుకు భారత జాతి సిగ్గుతో తలదించుకుంటోంది: హరికృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Harikrishna
హైదరాబాద్: తమ పార్టీ నాయకుల పట్ల మహారాష్ట్ర అనుసరించిన తీరుకు భారత జాతి సిగ్గుతో తలదించుకుంటోందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. తాము చేతగానివాళ్లం కాదని, తెలుగుజాతి ఆత్మగౌరవం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని ఆయన అన్నారు. మహారాష్ట్ర దాష్టీకానికి వ్యతిరేకంగా తెలుగుజాతి పౌరుషం ఉవ్వెత్తున ఎగిసి పడకముందే కళ్లు తెరవాలని ఆయన సూచించారు. తమ పార్టీ నాయకులపై పడిన లాఠీదెబ్బలు కాంగ్రెసు పార్టీని నాశనం చేస్తాయని, కాంగ్రెసు నాయకుల గుండెల్లో ఫిరంగులై పేలుతాయని ఆయన హెచ్చరించారు.

శాంతిసామరస్యాలకు, దేశభక్తికి మారుపేరైన మహారాష్ట్ర ప్రతిష్టను అశోక్ చవాన్ దెబ్బ తీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, తెలుగు ప్రజల మధ్య సత్సంబంధాలున్నాయని, అశోక్ చవాన్ ఆ సంబంధాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకులకు బాబ్లీ ప్రాజెక్టును చూపించాల్సిందేనని ఆయన అన్నారు. లోకసభ స్పీకర్, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ అనుమతి లేకుండా పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. బాబ్లీ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని 18 లక్షల ఎకరాల భూమి బీడుగా మారుతుందని ఆయన అన్నారు. తాము బాబ్లీకి వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమం చేపట్టాల్సి వచ్చిందో కూడా ఆయన తన బహిరంగ లేఖలో వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X