బాబ్లీపై అందరం ఒకే మాటగా వివరిస్తాం: పొన్నాల లక్ష్మయ్య
బాబ్లీ ప్రాజెక్టును ఆపించడానికి జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరనున్నట్లు ఆయన తెలిపారు. కోర్టు తీర్పులకు, ఒప్పందాలకు విరుద్ధంగా అనుమతులు లేకున్నా మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మిస్తోందని, దాని వల్ల దిగువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు నష్టం వాటిల్లుతుందని ప్రధానికి వివరించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. బాబ్లీని చూడడానికి వెళ్లిన మన రాష్ట్ర ప్రజాప్రతినిధుల పట్ల మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ సమావేశం తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య స్పర్థలు, విద్వేషాలు పెచ్చరిల్లకుండా బాబ్లీ సమస్యను పరిష్కరించుకోవాలని కూడా సమావేశం నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.
Comments
పొన్నాల లక్ష్మయ్య రోశయ్య తెలుగుదేశం బాబ్లీ హైదరాబాద్ ponnala laxmaiah rosaiah telugudesam babli hyderabad
Story first published: Friday, July 23, 2010, 14:39 [IST]