తెలుగుదేశం పార్టీకి మిగిలింది తీర్ధయాత్రలే: విజయశాంతి

ఈ ఉపఎన్నికలలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లక్ష్మీ నారాయణ చేతిలో రెండోసారి ఓడిపోయిన పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేరులోని రెండు అక్షరాలైన డి.ఎస్.కు విజయశాంతి ఆసక్తిదాయకమైన వివరణ ఇచ్చారు. ఆ పేరులోని డి అంటే నో డిపాజిట్ అని, ఎస్ అంటే నో సీట్ అని విజయశాంతి భాష్యం చెప్పారు. తెరాస విజయం క్రెడిట్ అంతా ప్రజలదేనని ఆమె అన్నారు. ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని ఆమె అన్నారు.
తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ఆమె అన్నారు. కాంగ్రెసు నాయకులు మాట మారుస్తూ ఉంటారని ప్రజలు అనుకుంటున్నారని, కాంగ్రెసు నాయకులను ప్రజలు తిడుతున్నారని ఆమె అన్నారు. బాబ్లీ పోరు చంద్రబాబు పోరాటం నాటకమేనని ఆమె అన్నారు. ఎన్నికల్లో తన విధి తాను నిర్వహించానని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications