ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆదిలాబాద్ జిల్లాలో భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Adilabad
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఈ కసాయి భర్త భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం పర్దాన్ గూడాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భర్త వెంకట్రావు భార్య ఇంద్రబాయిని హత్య చేసి పూడ్చి పెట్టాడు. ఇది బయటకు పొక్కడంతో అతను బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వారి ఇద్దరు పిల్లలు కనిపించడం లేదు. వారి కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు. వారిని కూడా బావిలో పడేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భార్యభర్తల మధ్య ఏడాది కాలంగా గొడవలున్నాయి. వారికి రెండేళ్ల కూతురు, ఓ పసిబాలుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం వారికి పెళ్లయింది. ఏడాది కాలంగా వారికి పర్సపరం పడడం లేదు. దీంతో ఆదివారం రాత్రి గొడవలు ముదిరి ఈ దారుణ సంఘటనకు దారి తీసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు శవాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X