వైయస్ జగన్ వెళ్లిపోతే కాంగ్రెసుతో చిరంజీవి రెడీ

తమ పార్టీ ఇప్పటికీ సమైక్యాంధ్ర మాటమీదే ఉందని చిరంజీవి స్పష్టం చేశారు. తమ పార్టీ ఈ విషయంలో వెనకడుగో, తప్పటడుగో, ముందడుగో వేస్తుందని కొన్ని పత్రికలు రాయడం ధర్మం కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కేంద్ర హోంమంత్రి చిదంబరంతో సమావేశంలో పాల్గొన్నపుడు ప్రజాభిప్రాయ సేకరణకోసం నిపుణుల కమిటీ వేయాలని సూచించామని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నందున దానికి అనుగుణంగానే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అందువల్లే కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications