హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొండా సురేఖ వ్యవహారంపై మొయిలీ నో కామెంట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
హైదరాబాద్: తమ పార్టీ శాసనసభ్యురాలు కొండా సురేఖ వ్యవహారంపై మాట్లడడానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ,కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ మాట్లాడడానికి నిరాకరించారు. కొండా సురేఖ ముఖ్యమంత్రి రోశయ్యపై విమర్శలు చేస్తూ రాసిన లేఖపై బుధవారం మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చేందుకు ఇష్టపడలేదు. 11 పేజీల లేఖను సురేఖ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ లకే కాకుండా వీరప్ప మొయిలీకి కూడా ఫాక్స్ చేశారు.

కాగా, పార్లమెంటు హాల్ లో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మొయిలీని కలిశారు. తనకు రాజ్యసభలో పని ఉందని, సాయంత్రం వివరంగా మాట్లాడుకుందామని మొయిలీ శ్రీనివాస్ కు చెప్పారు. బుధవారం సాయంత్రం మొయిలీతో తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలపైనే కాకుండా సురేఖ వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X