హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీకి పార్టీ తరఫున లేఖ ఇచ్చేది లేదు: చంద్రబాబు నాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: పార్టీ తరఫున శ్రీకృష్ణ కమిటీకి లేఖ ఇచ్చేది లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సమస్యను సృష్టించినవారే పరిష్కరించాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణను తమ పార్టీ కన్నా ఎక్కువ ఎవరూ అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలు కలిసి పార్టీని 28 ఏళ్లు ఆదరించాయని ఆయన చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు.

కామన్‌వెల్త్‌ నిర్వహణలో అవినీతి దేశ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ క్రీడల్ని నిర్వహిస్తామని ఏడేళ్ల క్రితమే నిర్వహిస్తామని తెలిసినా ఇప్పటివరకు పనులు పూర్తికాలేదని విమర్శించారు. కామన్‌వెల్త్‌ నిర్వహణలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని సీఈసీనే స్పష్టం చేసిందని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X