వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు ఎంపిల విందులు: ఎవరి రూటు వారిదే

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రాంతాలవారీగా విడిపోయి విందు రాజకీయాలు నడిపారు. తెలంగాణ, రాయలసీమ పార్లమెంటు సభ్యులు ప్రాంతాలవారీగా విడిపోయి సమావేశాలు పెట్టుకున్నారు. మంగళవారం రాత్రి తెలంగాణ పార్లమెంటు సభ్యులు సీనియర్‌ నేత కె. కేశవరావు ఇంట్లో భేటీ అయ్యారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మరో సీనియర్‌ నేత కావురి సాంబశివరావు ఇంట్లో చర్చలు జరిపారు. ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తెలంగాణ భావోద్వేగాన్ని అధిష్టానానికి వివరించాలని తెలంగాణ పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ స్థితిలో ప్రత్యేక తెలంగాణ ఇస్తేనే పార్టీ మనుగడ సాధ్యమవుతుందని, ఇరు ప్రాంతాల్లోనూ కాంగ్రెసు తిరుగులేని మెజారిటీతో గెలుస్తుందని తెలంగాణ ఎంపీలు చెప్పడానికి నిర్ణయించుకున్నారు.

సమైక్య భావనను అధిష్టానానికి వినిపించాలని కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమైన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నారు. భేటీ అనంతరం అనకాపల్లి ఎంపీ సబ్బంహరి విలేకరులతో మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలంతా శ్రీకృష్ణ కమిటీని ఢిల్లీలో కలవాలని నిర్ణయించినట్లు చెప్పారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను లేఖ రూపంలో వారి ముందు పెట్టాలని తీర్మానించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ ‌లో నెలకొన్న చిన్నపాటి గందరగోళ పరిస్థితులను చక్కదిద్దడానికి అధిష్ఠానం ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గత ఏడాది హోంమంత్రి ప్రకటన తర్వాత పార్టీ పెద్దలను కలవడం తప్ప ఆ తర్వాత ఎంపీలంతా ఉమ్మడిగా అధిష్ఠానాన్ని కలవలేదని ఆయన గుర్తుచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X