చంద్రబాబు నాయుడుపై తెలంగాణ నాయకుల తిరుగుబాటు?

చంద్రబాబుతో తాము అమీతుమీ తేల్చుకోవడానికి నిర్ణయించుకున్నట్లు సమావేశం వివరాలను ఓ తెలంగాణ నాయకుడు మీడియాకు లీక్ చేశారు. దీంతో కలకలం ప్రారంభమైంది. తెలుగుదేశం తెలంగాణ నాయకులు చంద్రబాబును కలిసేందుకు సిద్ధపడుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా శ్రీకృష్ణ కమిటీకి లేఖ ఇవ్వాలని వారు పట్టుబట్టేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఏ మాత్రం తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించవద్దని సీమాంధ్ర నాయకులు చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ అనుకూల వైఖరికి చంద్రబాబు బాహాటంగా స్వస్తి చెప్పడంతో తాము ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్లాలో చెప్పాలని తెలంగాణ నాయకులు చంద్రబాబును నిలదీసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications