చంద్రబాబు నాయుడుపై తెలంగాణ నాయకుల తిరుగుబాటు?
చంద్రబాబుతో తాము అమీతుమీ తేల్చుకోవడానికి నిర్ణయించుకున్నట్లు సమావేశం వివరాలను ఓ తెలంగాణ నాయకుడు మీడియాకు లీక్ చేశారు. దీంతో కలకలం ప్రారంభమైంది. తెలుగుదేశం తెలంగాణ నాయకులు చంద్రబాబును కలిసేందుకు సిద్ధపడుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా శ్రీకృష్ణ కమిటీకి లేఖ ఇవ్వాలని వారు పట్టుబట్టేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఏ మాత్రం తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించవద్దని సీమాంధ్ర నాయకులు చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ అనుకూల వైఖరికి చంద్రబాబు బాహాటంగా స్వస్తి చెప్పడంతో తాము ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్లాలో చెప్పాలని తెలంగాణ నాయకులు చంద్రబాబును నిలదీసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.
Comments
నాగం జనార్దన్ రెడ్డి కడియం శ్రీహరి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలంగాణ హైదరాబాద్ nagam janardhan reddy kadiyam srihari chandrababu naidu telugudesam telangana hyderabad
Story first published: Thursday, August 5, 2010, 16:18 [IST]