హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వైన్ ఫ్లూ మహమ్మారి విజృంభన: 21 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Swine Flu
హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. గురువారం ఒక్క రోజే రాష్ట్రంలో ముగ్గురు స్వైన్‌ ఫ్లూతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడి చనిపోయినవారి సంఖ్య 21కి చేరింది. మరో 18 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. బుధవారం 20 మందికి వ్యాధి సోకితే గురువారం 18 మందికి వ్యాధి ఉన్నట్లు తేలింది. దీంతో వ్యాధి సోకిన కేసుల సంఖ్య రాష్ట్రంలో 231కి చేరింది. మృతుల్లో ఇద్దరు నల్గొండ జిల్లాకు చెందినవారు కాగా, ఒకరు కరీంనగర్ జిల్లాకు చెందినవారు. నల్గొండ జిల్లా మోతే మండలం రాఘవాపూర్‌కు చెందిన కొమురయ్య(60) అనే వ్యక్తి స్వైన్‌ ఫ్లూ చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆరోగ్య శాఖ కార్యాలయం తెలిపింది. ఇదే జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం కోట పహాడ్‌ కు చెందిన రవి(30) అనే యువకుడు కూడా వ్యాధితో మృత్యువాత పడ్డాడు.

మరో బాలుడికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో అతడిని హైదరాబాద్‌ లోని రెయిన్ ‌బో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రఘుపతి(30)కి లక్షణాలు కనిపించడంతో నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు వ్యాధి నిర్ధారణ కావడంతో ఇక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కాగా గురువారం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల నుంచి మొత్తం 59 శాంపిళ్లను సేకరించి ఐపీఎంకు పంపగా మొత్తం 18 మందికి వైరస్ సోకినట్లు తేలింది. విశాఖలో ఇద్దరికి స్వైన్ ‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణైంది. ఒక్క విశాఖలోనే స్వైన్‌ ఫ్లూ నిర్ధారణ అయిన వారి సంఖ్య ఇప్పటి వరకూ 20కి చేరుకుంది. కాగా గాంధీ ఆస్పత్రి నర్సింగ్ స్టూడెంట్లపై అధికారులు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. గాంధీ నర్సింగ్ కాలేజీకి చెందిన 150 మంది విద్యార్థుల్లో 17 మందికి గురువారం దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపించాయి. దైంతో వీరిని వెంటనే గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. వారి నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపించినట్లు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X