హరికృష్ణ బహిరంగ లేఖ: తెరాస నేత కెసిఆర్ పై శివాలు

తెలుగుదేశం పార్టీ, తెలంగాణ విడదీయలేనివని, టిడిపి తెలంగాణలోనే పుట్టిందని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ సామాజిక విప్లవం తెచ్చారని ఆయన చెప్పారు. పదవీ వ్యామోహంతో, మంత్రి పదవి కోసం కెసిఆర్ తిన్నింటి వాసాలు లెక్కించారని ఆయన ఆరోపించారు. తెరాస రిటైల్ సేల్ సంస్థగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ పేరు చెప్పి కెసిఆర్ వేల కోట్ల రూపాయలు దండుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం తేవడానికి కాకుండా తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యలపై కెసిఆర్ దృష్టి పెట్టడం లేదని ఆయన అన్నారు.
పనిలో పనిగా హరికృష్ణ కాంగ్రెసు పార్టీపై కూడా నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల అమాయకత్వంతో కాంగ్రెసు పార్టీ ఆడుకుంటోందని ఆయన విమర్శించారు. తెలంగాణ తెస్తాం, ఇస్తాం, చస్తామంటున్న కాంగ్రెసు పార్టీ పార్లమెంటులో ఎందుకు బిల్లు ప్రతిపాదించడం లేదని ఆయన అడిగారు. బిల్లు పెడితే ఎవరైనా అడ్డుకోగలరా అని ఆయన అన్నారు. కెసిఆర్, జానా రెడ్డిలను ఘనాపాటీలను చేసింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications