వైయస్ జగన్ వర్గంపై రామోజీ రావు ఈనాడు దాడి

Ramoji Rao
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గాన్ని టార్గెట్ చేస్తూ రామోజీ రావు నేతృత్వంలోని ఈనాడు దినపత్రిక వార్తాకథనాల జోరును పెంచింది. గురువారం దినపత్రికలో నాలుగు వార్తాకథనాలు ప్రచురించింది. కాంగ్రెసులోని అంతర్గత పోరును ఆసరా చేసుకుని జగన్ వర్గంపై ఈనాడు దినపత్రిక దాడుల పరంపరకు పూనుకున్నట్లు భావిస్తున్నారు. ఎమ్మార్ కు విల్లాలు, సర్కారుకు నామాలు అంటూ ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై పతాక శీర్షికన వార్తాకథనాన్ని ప్రచురించింది. ఒప్పందాలు నాలుక గీసుకునేందుకే, నేతల అండదండలుంటే వేల కోట్లు దండుకోవచ్చు, 258 ఎకరాలు ఎంజీఎఫ్ ఇష్టారాజ్యం, ఎపిఐఐసికి పెద్ద మొండిచెయ్యి, గోల్ఫ్ కోర్స్ నుంచీ దమ్మిడీ లేదు, ఎజెండా నివేదికలో దిగ్భ్రాంతికర వాస్తవాలు అంటూ ఈనాడు దినపత్రిక వ్యాఖ్యానించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని కాంగ్రెసు శాసనసభ్యులు డిఎల్ రవీంద్రా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈనాడు వార్తకథనానికి ప్రాధాన్యం చేకూరుతోంది.

ఆ ప్రధాన కథనానికి బలం చేకూరుస్తూ ఓ ఉప కథనాన్ని కూడా ప్రచురించింది. ప్రభుత్వానికి పైసా దక్కకుండా 258 ఎకరాల కుంభకోణంలో అధికారులు డూడూ బసవన్నలేనని ఈనాడు వ్యాఖ్యానించింది. ప్రభుత్వానికి పైసా ఆదాయం చెల్లించకుండా 258 ఎకరాల ప్రభుత్వ స్థలంలో విల్లాలు, ఆపార్ట్ మెంట్లు కట్టుకుని అమ్ముకున్న వేల కోట్ల కుంభకోణంలోనూ సలహాదారు నీడ బయటికొస్తోందని బయట పెట్టింది. అయితే ఆ సలహాదారు పేరు మాత్రం రాయలేదు. ఆ సలహాదారు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. సర్కారు కళ్లల్లో సిమెంటు కొట్టారు అంటూ మరో కథనాన్ని ప్రచురించింది. గుంటూరు జిల్లాలోని కొన్ని సిమెంటు ఫ్యాక్టరీలు ఏకంగా ప్రభుత్వ భూములనే చెర పట్టి అక్రమ మైనింగ్ పాల్పడుతున్నాయంటూ ఆరోపణలు చేస్తూ ఆ వార్తాకథనం ప్రచురితమైంది. మొత్తం మీద, ఈనాడు దినపత్రిక ఒక పథకం ప్రకారం జగన్ వర్గానికి చెందిన లావాదేవీలపై వార్తాకథనాలను ప్రచురించడం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+