యాష్కీ రాజకీయ అజ్ఝాని, పిల్లకాకి: అంబటి రాంబాబు
నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లిన ఘనత మధు యాష్కీదేనని ఆయన అన్నారు. రాజకీయాల్లో యాష్కీ ఓ పిల్లకాకి అని, యాష్కీ రాజకీయ అజ్ఝానిలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రెండుసార్లు ఎంపిగా గెలిచినంత మాత్రాన జాతీయ నేత అయిపోయాననే భ్రమలో యాష్కీ ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ ప్రభంజనంతోనే యాష్కీ గెలిచారని ఆయన అన్నారు. తనపై ఎన్ని విచారణలు జరిపించినా తాను సిద్ధంగానే ఉన్నానని ఆయన చెప్పారు. సిఎల్పీ వేదికగా వైయస్ పై విమర్శలు చేయడం కూడా అధిష్టానాన్ని ధిక్కరించడమే అవుతుందని ఆయన అన్నారు. వైయస్ వల్ల గెలిచినవారు సిఎల్పీ వేదికగా ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
Comments
అంబటి రాంబాబు ఓదార్పు యాత్ర వైయస్ జగన్ కాంగ్రెసు హైదరాబాద్ ambati rambabu ys jagan congress odarpu yatra hyderabad
Story first published: Friday, August 13, 2010, 14:21 [IST]