తెలంగాణపై వ్యాఖ్య: 16 మంది సీమాంధ్ర మంత్రులకు షాక్

కాగా, తాను తెలంగాణవారిని కించపరచలేదని సీమాంధ్ర మంత్రి గాదె వెంకట రెడ్డి చెప్పారు. తెలంగాణవారిపై తనకు అపార గౌరవం ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే, నివేదికను మాత్రం తాను మీడియాకు అందించలేనని ఆయన చేతులెత్తేశారు. సీమాంధ్ర మంత్రులపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో పార్టీ ప్రతినిధులు గురువారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. ఆ మంత్రులను బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications