హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వ్యతిరేకులపై కొండా సురేఖ మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్‌: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యతిరేకులపై కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ తీవ్రంగా మండి పడ్డారు. జగన్ ను పార్టీనుంచి బయటకు పంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఆమె జగన్ ను కలుసుకున్నారు. తనపై చర్య తీసుకుంటే, గతంలో వైఎస్ ‌పై విమర్శలు చేసినవారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె జగన్ తో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు.

వైఎస్‌ను అభిమానించేవారిపై ఎందుకు కక్ష సాధిస్తున్నారో అర్థం కావటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం నుంచి తనకు ఏ విధమైన షోకాజ్ నోటీసు అందలేదని ఆమె చెప్పారు. తమ పార్టీ నాయకుడు అంబటి రాంబాబుకు ఏ విధమైన లేఖ అందలేదని, మీడియా ద్వారా తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఇచ్చిన సమాచారం తప్ప అంబటికి అధికారికంగా లేఖ అందలేదని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X