వైయస్ జగన్ కోసమే చిరంజీవిపై రాజశేఖర్ దంపతుల పోరు?

ఈసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను ప్రధానం చేసుకుని రాజశేఖర్ దంపతులు ఆరోపణలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రభుత్వం నుంచి విపరీతమైన ప్రోత్సహాకాలు పొందుతూ పేదలకు సాయం చేస్తున్నది తక్కువ అని వారి ఆరోపణల్లో ప్రధానమైంది. చిరంజీవి వ్యక్తిత్వంపై కూడా వీరు విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెసు పార్దీకి దగ్గరవుతున్నట్లు సంకేతాలు ఇస్తూ వైయస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేయడంతో రాజశేఖర్ దంపతులు తెర మీదికి వచ్చారు. జగన్ కోసమే వారు ముందుకు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కాంగ్రెసుకు దగ్గరైతే జగన్ దూరమవుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవిని అడ్డుకుందనేందుకే వారు ఆరోపణలు చేశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications