19న ఢిల్లీకి ముఖ్యమంత్రి రోశయ్య: జగన్ గ్రూప్ పై చర్చ?

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య కీలకమైన ఎజెండాతో ఈ నెల 19వ తేదీన ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ అధిష్టానంతో పార్టీ వ్యవహారాలను, ప్రభుత్వ వ్యవహారాలను ఆయన ఈ సందర్భంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ఆ రెండు రోజుల్లో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ గ్రూపు రాజకీయాలను ఆయన అధిష్టానం దృష్టికి తెచ్చే అవకాశం ఉంది. అలాగే వైయస్ రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేసుకుని ఎమ్మార్ ప్రాపర్టీస్ పై వచ్చిన విమర్సలను ఆయన సోనియా గాంధీ దృష్టికి తీసికెళ్లే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2వ తేదీన జగన్ వర్గం తిరుపతిలో నిర్వహిస్తున్న వైయస్ సంస్మరణ సభకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తరఫున నిర్వహించే కార్యక్రమాన్ని కూడా ఆయన ఖరారు చేసుకునే పరిస్థితి ఉంది.

కాగా, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చించి ఆమోద ముద్ర వేయించుకుంటారని అంటున్నారు. చాలా కాలంగా మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ వాయిదా పడుతూ వస్తోంది. ఈసారి ఆ విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకునేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడి మార్పుపై కూడా చర్చించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+