రంగంలోకి దిగిన పనబాక లక్ష్మి: వైయస్ జగన్ ఓదార్పు మంతనాలు

జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని పార్టీ శాసనసభ్యులకు తన మాటగా చెప్పాలని చేసిన సూచన మేరకు పనబాక లక్ష్మి నేరుగా రంగంలోకి దిగినట్లు భావిస్తున్నారు. చర్చల తర్వాత ప్రకాశం జిల్లా శాసనసభ్యులు పార్లమెంటు హాల్ కు వెళ్లనున్నారు. పనబాక లక్ష్మి నివాసంలో జరిగిన చర్చల వివరాలను జెసి దివాకర్ రెడ్డి సోనియాకు నేరుగా వివరించే అవకాశం ఉంది. జగన్ ఓదార్పు యాత్ర విషయంలో తాము అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని శాసనసభ్యులు చెబుతున్నారు. అయితే, జగన్ యాత్ర కాంగ్రెసుకు వ్యతిరేకం కాదని, ఆయన వ్యతిరేకులు దాన్ని ప్రతికూలంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఒకరిద్దరు శాసనసభ్యులు అభిప్రాయపడినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications