ఆత్మహత్యలకు వ్యతిరేకంగా తెలంగాణ విద్యార్థుల ప్రతిజ్ఞలు

Telangana
హైదరాబాద్: ఆత్మహత్యలకు వ్యతిరేకంగా తెలంగాణవ్యాప్తంగా బుధవారం విద్యార్థులు ప్రతిజ్ఞలు చేశారు. తెలంగాణకు చెందిన ప్రజా సంఘాల జెఎసిలన్నీ ఎక్కడికక్కడ ఈ ప్రతిజ్ఞా కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. తెలంగాణ కోసం యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆత్మహత్యల నిరోధానికి తెలంగాణ ప్రజా సంఘాలు సామూహిక ప్రతిజ్ఞా కార్యక్రమాలను తలపెట్టాయి. తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాదులని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐకాస ఆధ్వర్యంలో సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు సామూహికంగా ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞలు చేశారు. ఓయూ ఐకాస ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో ఆత్మహత్యల నిరోధక కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్, బిజెపి నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమంటే ఆత్మహత్యలు కాదని వక్తలు పిలుపునిచ్చారు. పోరాడి తెలంగాణ సాధించాకుందామని అన్నారు. గుండె నిబ్బరంతో వ్యవహరించాలని వారు విద్యార్థులకు సూచించారు. తెలంగాణ వచ్చి తీరుతుందని నమ్మబలికారు. కాగా, హైదరాబాదులోని గన్ పార్కు వద్ద కూడా విద్యార్థులు సామూహిక ప్రతిజ్ఝ చేశారు.

తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ సామూహిక ప్రతిజ్ఞలు జరిగాయి. ఖమ్మంలో విద్యార్థులు మానవ హారం నిర్మించారు. నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ప్రతిజ్ఞా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద యెత్తున పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+