రేపటి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి ఆమరణ దీక్ష

Bhumana Karunakar Reddy
తిరుమల: తనపై వచ్చిన ఆరోపణల మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తిరుపతిలో తాను దీక్షను ప్రారంభిస్తానని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని వివాదాలమయం చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ లేదా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన కోరారు. వాటిలో ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. టిటిడి వ్యవహారాలపై వస్తున్న విమర్శలకు తగిన సమాధానాలు భక్తులకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి గుర్తులను ప్రజల మనస్సుల్లోంచి చెరిపేసే శక్తి ఎవరికీ లేదని ఆయన అన్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ భవిష్యత్తు ఆశాకిరణమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+