జగన్ ఓదార్పుకు వెళ్లొద్దని హై కమాండ్ చెప్పింది: గొట్టిపాటి రవికుమార్

Sonia Gandhi
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్రకు వెళ్లొద్దని పార్టీ అధిష్టానం చెప్పిందని కాంగ్రెసు అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఓదార్పు యాత్రపై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ప్రకాశం జిల్లా శాసనసభ్యులు గురువారం హైదరాబాదు తిరిగి వచ్చారు. బుధవారం ప్రకాశం జిల్లా కాంగ్రెస్‌ శాసనసభ్యులు కేంద్ర మంత్రులు పనబాక, పురందేశ్వరి, ఎంపీ మాగుంటతో కలిసి సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తో భేటీ అయ్యారు. జగన్‌ ఓదార్పు యాత్రపై చర్చించారు.

వైయస్ జగన్ కూడా తన నిర్ణయాన్ని స్పష్టం చేశారని, ఎవరు వచ్చినా రాకున్నా తన ఓదార్పు యాత్ర కొనసాగుతుందని చెప్పారని గొట్టిపాటి రవికుమార్ గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే, తమ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అయితే, అధిష్టానం మాట వినాలని ప్రకాశం జిల్లా శాసనసభ్యులు వైయస్ జగన్ కు సూచించారు. కానీ ఆయన వారి మాట వినకపోగా, వారిపై కస్సుమన్నారు. ఈ స్థితిలో ఓదార్పు యాత్రకు దూరంగా ఉండాలనే మెజారిటీ శాసనసభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+