చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై విచారణకు ప్రభుత్వం ఆదేశం
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అక్రమాలు జరుగుతున్నాయని సినీ హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం నుంచి విశేష రాయితీలు పొందుతూ రక్తం కావాల్సిన వారి నుంచి పెద్ద మొత్తంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ డబ్బులు వసూలు చేస్తోందని వారు అన్నారు. చిరంజీవి రక్తాన్ని అమ్ముకుంటున్నారని వారు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ ముఖ్యమంత్రి రోశయ్యను కలిసి ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు.
చిరంజీవి జీవిత రాజశేఖర్ బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్ chiranjeevi jeevitha rajasekhar blood bank hyderabad
Story first published: Monday, August 23, 2010, 17:20 [IST]