హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై విచారణకు ప్రభుత్వం ఆదేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై వచ్చిన ఆరోపణల మీద రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విచారణకు ఆదేశించింది. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీతో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 20వ తేదీన నివేదిక సమర్పించాలని కూడా ప్రభుత్వం విచారణ కమిటీని ఆదేశించింది. బ్లడ్ బ్యాంక్ పై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపించాలని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఇటీవల ముఖ్యమంత్రి కె. రోశయ్యను కోరిన విషయం తెలిసిందే.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అక్రమాలు జరుగుతున్నాయని సినీ హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం నుంచి విశేష రాయితీలు పొందుతూ రక్తం కావాల్సిన వారి నుంచి పెద్ద మొత్తంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ డబ్బులు వసూలు చేస్తోందని వారు అన్నారు. చిరంజీవి రక్తాన్ని అమ్ముకుంటున్నారని వారు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ ముఖ్యమంత్రి రోశయ్యను కలిసి ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X