Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రజ్యోతి డైలీపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం

Andhra Jyothi logo
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రికపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తాను నివేదిక సమర్పించినట్లు వార్తాకథనం ప్రచురించడంపై ఆయన ఆ పత్రికపై మండిపడినట్లు సమాచారం. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై, రాష్ట్ర విభజనపై ఆయన నివేదిక సమర్పించినట్లు వార్తలు వచ్చాయి. జగన్ పై సమర్పించినట్లు వచ్చిన వార్తాకథనాన్ని అలా ఉంచితే తెలంగాణపై సమర్పించినట్లు వచ్చిన వార్తాకథనంపై తీవ్ర దుమారం చెలరేగింది. రాష్ట్ర విభజన చేయాల్సి వస్తే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని గవర్నన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు వార్తలు వచ్చాయి.

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనే గవర్నర్ సూచనపై తీవ్ర దుమారం చెలరేగింది. గవర్నర్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తీవ్రంగా మండిపడింది. గవర్నర్ అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించింది. గవర్నర్ తీరును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తప్పు పట్టారు. గవర్నర్ కార్యాలయం నిఘా విభాగం మాదిరిగా మారిందని, రాజకీయమయమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దుమారంతో ఇరకాటంలో పడిన గవర్నర్ ఆంధ్రజ్యోతిపై మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+