చంద్రబాబు నాయుడు ఓదార్పు: వైయస్ వారసత్వంపై ప్రశ్నలు

'వైఎస్ తండ్రిది నేర చరిత్ర. రౌడీ షీటర్. వ్యాపారంలో లాభాల కోసం చంపారు. వైఎస్ సైతం అనేక మందిని పొట్టనపెట్టుకున్నారు. వీరి దౌర్జన్యాల గురించి 'పాలెగాళ్ల రాజ్యం' పేరుతో పౌరహక్కుల సంఘం ఎప్పుడో కరపత్రం వేసింది. పోలీసుల సాక్షిగా పరిటాల రవిని చంపించారు. హత్యలకు సంబంధించి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇంత దారుణాలు జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్ఠానానికి ఏమీ పట్టదా? రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఎన్నడూ హత్యలు జరగలేదు. చనిపోయిన వారిలో 95 శాతం మంది బీసీ, ఎస్సీ, అల్పసంఖ్యాక వర్గాలు..పేదలే' అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.ఏయే జిల్లాలో ఎంత మంది హత్యకు గురయ్యారనే లెక్కలను కూడా ఆయన చెప్పారు.
వైయస్ పాలనలోని బాధితుల పిల్లల్ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఉంచి చదివిస్తున్నానని తెలిపారు. వీరితో తాను మాట్లాడినప్పుడు పెద్దయ్యాక ఏం చేస్తారని అడిగితే..తమ తండ్రిని చంపిన వారిని చంపుతామని కొందరన్నారని, ఇది విని తనకు చాలా బాధేసిందని వెల్లడించారు. బాగా చదువుకుని, జీవితంలో స్థిరపడి, తల్లిని బాగా చూసుకోవాలని నచ్చజెప్పానని, అనంతరం వారిలో మార్పు వచ్చిందని వివరించారు. బాధిత కుటుంబాలకు రూ.3.5 కోట్లు సాయం చేసినట్లు తెలిపారు. ముఠా నాయకుడు సీఎం అయితే ఏం జరుగుతుందో ముందుగానే తాము పుస్తకం ప్రచురించామని, తరువాత కూడా ఆయన అరాచకాలపై పలు పుస్తకాలు వేశామని వివరించారు.












Click it and Unblock the Notifications