నన్ను ఆశీర్వదించి, ప్రకాశం ఓదార్పునకు పంపండి: వైయస్ జగన్

YS Jagan
కడప: తనను ఆశీర్వదించి ప్రకాశం జిల్లా ఓదార్పునకు పంపించాలని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రజలను కోరారు. కడప జిల్లా పోరుమామిళ్లలోని ఆస్పత్రి సెంటర్ వద్ద ఆయన శుక్రవారం వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమయాభావం వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని ఆయన అన్నారు. ఇంత మంది తనకు తోడుగా ఉన్నారని, తనను దీవిస్తున్నారని, తనతో ఆప్యాయతను పంచుకుంటున్నారని ఆయన అన్నారు.

నాన్న తనకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారని ఆయన అన్నారు. మోసారి మీ ముందుకు వస్తానని ఆయన చెప్పారు. ముందు ఆయన శాసనసభ్యురాలు కమలమ్మ ఇంటికి వెళ్లారు. విగ్రహావిష్కరణ అనంతరం ఆయన ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట శాసనసభ్యులు కమలమ్మ, శ్రీకాంత్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, శ్రీనివాసులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+