ధిక్కారమే: ఓదార్పు యాత్రకు బయలుదేరిన వైయస్ జగన్

YS Jagan
కడప: పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు బయలుదేరారు. ఓదార్పు యాత్రను విరమింపజేయడానికి అధిష్టానం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ద్వారా చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలమైంది. జగన్ శుక్రవారం ఉదయం ఇడుపులపాయ నుంచి ప్రకాశం జిల్లాలోని గిద్గలూరు నుంచి ఓదార్పు యాత్రను చేపట్టేందుకు బయలుదేరి వెళ్లారు. తల్లి, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ ఆశీర్వాదాలు తీసుకుని ఆయన ఓదార్పు యాత్రకు బయలుదేరారు. శుక్రవారం గిద్దలూరులో వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించి కొత్తపల్లి, తిమ్మాపురం, రాచర్ల శివార్ల మీదుగా జగన్ గంగంపల్లి చేరుకుంటారు.

ఆ తర్వాత ఆయన రాచర్ల చేరుకుంటారు. అములపల్లె, తురిమెళ్ల, పెద్ద నల్లకాలువ, చినకంభం, పోరుమామిళ్లల మీదుగా హజరత్ గూడెం చేరుకుంటారు. ఆ తర్వాత కంభం నాగులవరం మీదుగా దొనకొండ, నాగులవరం, కాకర్లల్లో బాధితులను ఓదారుస్తారు. కాకర్ల నుంచి కంభం చేరుకుంటారు. శుక్రవారం రాత్రి అక్కడ బస చేస్తారు. శుక్రవారం ఆయన తొమ్మిది వైయస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+